రానున్న ఎన్నికల్లో సి.ఎం జగన్ ఎక్కడ నుంచి ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తాననీ సినీనటుడు … ఎ.
పి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు… ఆలీ అన్నారు.రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆర్.పి.ఎల్ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు.మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదవ సీజన్ క్రికెట్ టోర్నీలో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 28 జట్లు పాల్గొంటున్నాయి. రాజమండ్రి ప్రీమియర్ లీగ్ నుంచి ఇప్పటికే ఇద్దరు ప్లేయర్లు ఐ.పి.ఎల్ ఆడటం గర్వకారణం అని ఆలీ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని ప్రచారం జరగడం సాధారణమే అని అన్నారు.