యాదాద్రి భువనగిరి జిల్లా: రెండు పర్యాయాలుగా బీఆర్ఎస్ పథకాలు కేవలం ధనికులకు ఉపయోగపడ్డాయని,కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు మధ్యతరగతి,పేద కుటుంబాలను ఆకర్షించాయని అందుకే ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆలేరు ప్రజలు బీర్ల ఐలయ్యకు పట్టం కట్టారని తెలుస్తోంది.బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత నియోజకవర్గ వ్యాప్తంగా బరాబర్ ప్రభుత్వ పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే లబ్ది చెందుతాయని,జెండా మోసిన కార్యకర్తలకు పెద్దపీట వేసి ఇస్తామని బహిరంగ సభలలో చెప్పడంతో నిజమైన లబ్ధిదారుల మనోగతం దెబ్బతిన్నదనే వాదన బలంగా వినిపిస్తోంది.
అదే టైములో ఎలాంటి పదవులు లేకుండా బీర్ల ఫౌండేషన్ ద్వారా తన సొంత ఖర్చులతో పేద ప్రజలకు అండగా ఉంటూ అనునిత్యం తలలో నాలికలాగా బీర్ల ఐలయ్య తోచినంత సహాయం చేస్తూ ప్రతి ఇంటిలోనీ మనిషిలాగా కలగోలుపు తనంతో ఉండటం వలన ఆలేరు ప్రజలకు బిర్లా ఐలయ్య మీద నమ్మకం కుదరడంతో కాంగ్రెస్ అధిష్టానం చేసిన సర్వేలో ఆలేరులో ఉన్న హేమాహేమీల కంటే ఐలయ్య ముందంజలోకి వచ్చారని అంటున్నారు.ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఐలయ్య వైపే ప్రజలు మొగ్గుచూపారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.