అక్కినేని హీరో అఖిల్( Akhil ) హీరో గా నటించిన ఏజెంట్ సినిమా( Agent movie ) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సినిమా కనీసం రూ.20 కోట్ల వసూళ్లని కూడా సాధించలేక పోయింది.దాంతో సినిమా నిర్మాతలు తీవ్రంగా నష్ట పోయారు.
అంతే కాకుండా దర్శకుడు మరియు ఇతర యూనిట్ సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.పూర్తి స్థాయి స్క్రిప్ట్ వర్క్ జరగకుండానే సినిమా షూటింగ్ మొదలు పెట్టినందుకు కానీ ఇంత పెద్ద నష్టం జరిగిందని అభిమానులు మరియు నిర్మాత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా లో సురేందర్ రెడ్డి( Surender Reddy ) పై అక్కినేని ఫ్యాన్స్ లో ట్రోల్స్ చేస్తున్నారు.ఇక సినిమా ని ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్( OTT streaming ) చేసేందుకు సోనీ లివ్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా ఓటీటీలో స్క్రీనింగ్ జరగాల్సి ఉన్నా కూడా విడుదల వాయిదా వేయడం జరిగింది.
డేట్ ప్రకటించిన తర్వాత వాయిదా వేయడం ఏంటి అంటూ సోనీ లీవ్ అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.అసలు వాయిదాకి కారణం ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.సోనీ లివ్ అతి త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామంటూ ఒక ప్రకటన చేసింది.
నిర్మాత మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి మధ్య విభేదాన కారణంగా సినిమా స్ట్రీమింగ్ అడ్డుకొని ఉంటారు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.సినిమా నిర్మాణం లో సురేందర్ రెడ్డి భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
కనుక ఆయన ఈ సినిమా స్ట్రీమింగ్ ని అడ్డుకొని ఉంటాడు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయం ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
అఖిల్ అక్కినేని ఈ సినిమా పై పెట్టుకున్న నమ్మకం వమ్ము అయ్యింది.దాంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.