ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు.తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు మీరిస్తామన్న సొమ్ములేవని ప్రశ్నించారు.
మీరు చేసిన మోసంతో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడ్డారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అగ్రిగోల్డ్ బాధితులకు రావాల్సిన రూ.3,080 కోట్లను చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు.అధికారంలోకి వచ్చిన తరువాత అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి సీఎం జగన్ మాట తప్పారని తీవ్రంగా ఆరోపణలు చేశారు.







