హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.మేడ్చల్ సర్వేల రిపోర్టును బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
అసమ్మతి నేతల నిరసనతో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.మేడ్చల్ నియోజకవర్గ నేత హరివర్ధన్ రెడ్డి అనుచరులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ బచావ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ నేపథ్యంలో సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించాలన్న నాయకులు హరివర్ధన్ రెడ్డికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.







