ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ నివాసం వద్ద డీకే శివకుమార్ అనుచరులు ఆందోళనకు దిగారు.రాహుల్ గాంధీతో సమావేశం కొనసాగుతున్న సమయంలోనే నిరసన కార్యక్రమం చేపట్టారని తెలుస్తోంది.
డీకే శివకుమారే సీఎం అంటూ మద్దతుదారులు నినాదాలు చేశారు.పార్టీ అధిష్టానం డీకే శివకుమార్ నే సీఎంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఒప్పుకోమని, డీకే శివకుమారే కర్ణాటక కాంగ్రెస్ కు వెన్నెముక అని తెలిపారు.డీకేపై ఉన్నవి తప్పుడు కేసులని ఆయన మద్దతు దారులు వెల్లడించారు.