మెగాస్టార్ చిరంజీవి మొన్న సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
యంగ్ హీరోలకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తో రాబట్టిన కలెక్షన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇతర యంగ్ హీరోల స్థాయిలో చిరంజీవి సినిమా వసూలు రాబట్టడం కచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా లో మెగాస్టార్ చిరంజీవి యొక్క స్టామినా ఏంటో కూడా అందరికీ తెలిసిందే.అందుకే వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి యొక్క రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందని వార్తలు కూడా వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య మరియు భోళా శంకర్ సినిమాలకు చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ తో పోలిస్తే తదుపరి సినిమా కు తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ దాదాపుగా 50% ఎక్కువ అంటున్నారు.ఖైదీ నెంబర్ 150 సినిమా తో పదేళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి టాలీవుడ్ లో మళ్ళీ అడుగు పెట్టాడు.అయినా కూడా చిరంజీవి యొక్క స్టార్టమ్ ఏ మాత్రం తగ్గలేదు.ఆయన ఏ సినిమా చేసిన కూడా మినిమం కలెక్షన్స్ నమోదు అవుతూనే ఉన్నాయి.ఆచార్య సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకున్న కూడా కలెక్షన్స్ విషయం లో పరవాలేదన్నట్లుగానే వచ్చాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.అందుకే ఆయన తో సినిమా నిర్మించాలని ప్రముఖ నిర్మాతలు వెంట పడుతూ కోట్ల రూపాయల అడ్వాన్సు ను ఆయన కు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
మరో రెండు మూడు సినిమాలు ఇదే స్థాయిలో సక్సెస్ అయితే చిరంజీవి 100 కోట్ల కు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశాలు లేక పోలేదు అంటూ మెగా ఫాన్స్ ధీమా తో ఉన్నారు.