Adivi Sesh Pawan : ఆ కథ నాకు తెలుసు.. బ్లాస్ట్ అవడం పక్కా..!

పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబో మూవీ ఎనౌన్స్ మెంట్ తోనే భారీ అంచనాలను ఏర్పరచుకోగా ఈ కలయిక గురించి మరో యువ హీరో అడివి శేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

రీసెంట్ గా హిట్ 2 హిట్ కొట్టిన సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడివి శేష్ పవన్ సుజిత్ కాంబో సినిమా కథ తనకు తెలుసని.

సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుందని అన్నాడు.రన్ రాజా రన్ సినిమాతో హిట్ అందుకుని సాహో సినిమా ఛాన్స్ అందుకున్న సుజిత్ ఆ మూవీని స్టైలిష్ గా తెరకెక్కించాడు కాని మూవీతో కమర్షియల్ హిట్ అందుకోలేదు.

అందుకే అతనికి ఇంతకాలం ఛాన్సులు రాలేదు.ఇక ఫైనల్ గా సుజిత్ కథకు ఛాన్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ రోజే అంచనాలు పెరగా అడివి శేష్ కామెంట్స్ తో ఇంకాస్త బజ్ పెరిగింది.

Advertisement

ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

 ఈ సినిమాని త్వరగా పూర్తి చేసి 2023 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.

Advertisement

తాజా వార్తలు