కరోనా కారణంగా నష్టపోయిన వారికి సహాయం చేసేందుకు తెలుగు హీరోయిన్ ఏకంగా....

ప్రస్తుతం కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న సంగతి గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.దీంతో  ఇప్పటికే అత్యవసర లాక్ డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా రోజువారి కూలీలు, నిరుపేదలు, పూటగడవని వారు తదితరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

 Nithya Menen, Tollywood Heroine, Helping People, Corona Virus, Lock Down-TeluguStop.com

దీంతో వీరికి సహాయం చేసేందుకు పలువురు సినీ ప్రముఖులు మరియు సంపన్నులు తమకు తోచినంత మొత్తాన్ని విరాళంరూపంలో సహాయంగా అందించారు.అయితే తాజాగా గ్రామాల్లో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు సహాయం చేసేందుకు టాలీవుడ్ బొద్దుగుమ్మ నిత్యమీనన్ ముందుకొచ్చింది.

ఇందులో భాగంగా తాను ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో  ధరించిన దుస్తులను  ఆన్ లైన్ ద్వారా వేలం వేసి వచ్చిన మొత్తాన్ని పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఉపయోగించనున్నట్లు నిత్యామీనన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది.అయితే ఈ వేలం ఈ నెల 17వ తారీఖున నిర్వహించనున్నట్లు కూడా తెలిపింది.

అయితే నిత్యామీనన్  చేసినటువంటి పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అలాగే పేద ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చినటువంటి నిత్యామీనన్ పై ప్రశంసల జల్లు  కురిపిస్తున్నారు.

Telugu Corona, Lock, Nithya Menen, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నిత్యామీనన్ నటించినటువంటి మిషన్ మంగళ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.అయితే ప్రస్తుతం నిత్యామీనన్ “కోలాంబి” అనే మలయాళ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube