తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విలక్షన నటుడు మోహన్ బాబు కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అలాగే బుల్లితెర పై పలు షోలకు హోస్ట్ గా వ్యవహారించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.ఇకపోతే తరచుగా సోషల్ మీడియాలో నిలిచే వారిలో మంచు లక్ష్మి కూడా ఒకరు.
ఈమె తరచూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియా( social media _లో నిలుస్తూనే ఉంటుంది.
అలాగే మంచు ఫ్యామిలీలో ఎక్కువగా ట్రోలింగ్స్ ని ఎదుర్కొనే వారిలో మంచు లక్ష్మి కూడా ఒకరు అని చెప్పవచ్చు.తనపై ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా మంచు లక్ష్మి ( Manchu lakshmi, )అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది.తనకు తన ఫ్యామిలీకి తన కూతురికి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మంచు లక్ష్మి కూతురికి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే మంచు లక్ష్మి కూతురికి యాక్సిడెంట్ జరిగిందని గాయాలు కూడా అయ్యాయి అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఇదే విషయంపై తాజాగా మంచు లక్ష్మి స్పందించింది.యాక్సిడెంట్ జరిగి చాలా రోజులు అయ్యిందని.ఈ నెల 19న మంచు మోహన్ బాబు పుట్టిన రోజు అయిపొయిన తర్వాత పిల్లలంతా బగ్గీలో ప్రయాణిస్తుండగా అది ఒక్కసారి అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిందట.దాంతో పిల్లలు కిందపడిపోయారు.
ఆ బగ్గీలో మంచు లక్ష్మీ కూడా ఉన్నారట.ఆ సమయంలో ఆమె పక్కకు దూకేయగా పిల్లలంతా రోడ్డుపై పడిపోయారట, పిల్లలకు ఏమైందని గట్టిగా అరుస్తూ వెళ్ల గా అప్పటికే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ( Vidya Nirvana ) మొహం నిండా రక్తంతో కనిపించిందట.
పాపని గుర్రపు బండి ఎక్కించుకాకుండా ఉంటె బాగుండేదని,అలా చేయడం వల్ల పాపకు కుట్టు పడ్డాయి అని మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు.