సినీ నటిగా, మోడల్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో మధుశాలిని ఒకరనే సంగతి తెలిసిందే.అందాల పోటీలలో గెలవడంతో మోడలింగ్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన మధుశాలిని టీవీ యాంకర్ గా కొంతకాలం పాటు పని చేసి ఆ తర్వాత సినీ నటిగా మారారు.
ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన కితకితలు సినిమా మధుశాలినికి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.
పళనియప్ప కల్లూరి అనే సినిమాతో మధుశాలిని తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
హ్యాపీ జర్నీ, పతినారు, కారాలు మిరియాలు, మరికొన్ని సినిమాలలో మధుశాలిని నటించారు.పెద్ద సినిమాలలో ఎక్కువగా నటించకపోవడం వల్ల మధుశాలినికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని చెప్పాలి.
అయితే తక్కువ సినిమాలలోనే నటించినా ఆ సినిమాలతో నటిగా మధుశాలిని పేరుప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.
తాజాగా మధుశాలిని పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.
రహస్యంగా తమిళ హీరోను మధుశాలిని పెళ్లి చేసుకున్నారు.నిక్కీ గల్రానీ, నయనతార ఈ ఏడాదే పెళ్లి చేసుకోగా మధుశాలిని కూడా పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం.
తమిళ హీరో గోకుల్ ఆనంద్ ను మధుశాలిని వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత మధుశాలిని సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.
పంచాక్షరం అనే సినిమాలో మధుశాలిని, గోకుల్ ఆనంద్ కలిసి నటించగా ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం అందుతోంది.మధుశాలిని, గోకుల్ ఆనంద్ పలు వెబ్ సిరీస్ లలో కలిసి నటించగా ఆ వెబ్ సిరీస్ లు సైతం హిట్ గా నిలవడం గమనార్హం.గోకుల్ ఆనంద్, మధుశాలిని పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా వీళ్లిద్దరూ అన్యోన్యంగా జీవనం సాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.