కుట్టి పద్మిని… చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడు నెలల ప్రాయం నుంచే నటించడం మొదలు పెట్టి నేటికి కూడా నటిస్తున్న నటి.ఆమె తల్లి రాధ కూడా మంచి యాక్ట్రెస్.
అంతే కాదు మహానటి సావిత్రి కి స్నేహితురాలు.అందుకే కుట్టి పద్మినికి సినిమా ఏంటి ఆమె పుట్టిన నెలల ప్రాయంలోనే జరిగిపోయింది.
ఇక చిరు ప్రాయంలోనే లేత మనసులు సినిమాలో ఆమె నటించిన తీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఈ చిత్రం లో కోడి ఒక కోనలో అంటూ ఎంతో ఎమోషనల్ గా ఉండే పాటలో ఆమె హావభావాలు బాగా పలికించింది.ఇక కాస్త వయసు పెరగగానే హీరోయినిగా మరింత వయసు పెరిగాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది పద్మిని.
సినిమా జీవితం లో ఎలాంటి అలుపు లేకుండా ఐదు దశాబ్దాలు గా బాగానే మ్యానేజ్ చేసింది కానీ వ్యక్తి గత జీవితంలో మాత్రం ఆమె ఓడిపోయింది అనే చెప్పాలి.
రెండు సార్లు పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె ఇప్పటికి ఒంటరిగానే తన కూతుళ్లతో ఉంటుంది.మొదటి భర్త తో పెళ్లయ్యాక కొన్ని విభేదాలు రావడం తో విడాకులు తీసుకొని మరొక పెళ్లి చేసుకుంది.ఇక రెండో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టే వరకు అంత బాగానే ఉంది.
ఈ లోగ మొదటి భర్త బాగా మద్యానికి బానిస అయిపోయి ఆస్థి మొత్తం హారతి కర్పూరం చేసి ఆరోగ్యం పాడై మంచాన పడితే అన్ని తెలిసి వదిలేయ లేకపోయిపోయింది పద్మిని.తన ఇంట్లోనే కింద ఒక పోర్షన్ తీసి అతడి బాగోగులు చూసుకుంది.
విడాకులు తీసుకున్న భర్త అయినంత మాత్రాన చచ్చిపోతుంటే చూడలేకపోయాను అంటుంది పద్మిని.
అతడి తో పడక పంచుకోలేను కానీ స్నేహితురాలిగా సహాయం చేయాలి భావించి ట్రీట్మెంట్ ఇప్పించి తాను తీస్తున్న సీరియల్ ప్రొడక్షన్ కంపెనీ లో జాబ్ లో పెట్టుకొని ముప్పై వేలు జీతం ఇచ్చింది.ఇంత చేసిన కూడా కొన్ని రోజుల క్రితం అతడి ఆరోగ్యం బాగోలేక కన్ను మూసాడు.ఈ లోగ ఆమె రెండో భర్త తన సెకరెట్రీ తో ప్రేమలో పడి పద్మిని ని విడిచి పెట్టి వెళ్ళిపోయాడు.
అందుకే పిల్లలిద్దరినీ తన దగ్గరే పెట్టుకొని పెంచుతుంది.పద్మిని పెద్ద అమ్మాయి లాయర్ గా సెటిల్ అయ్యింది.