బాహుబలి షూటింగ్ టైమ్ లో రక్తం పీల్చేశాయి.. నటుడి కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన పింగ్ పాంగ్ సూర్య సినిమాలలో కామెడీ రోల్స్ లో ఎక్కువగా నటించి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.బాహుబలి సినిమా షూటింగ్ కోసం కేరళలో 25 రోజులు ఉన్నామని ఆయన అన్నారు.

 Actor Ping Pong Surya Comments About Bahubali Movie Shooting Details, Bahubali ,-TeluguStop.com

సినిమాలో వాటర్ ఫాల్స్ అంతా కేరళ అని పింగ్ పాంగ్ సూర్య కామెంట్లు చేశారు.

నాలుగు వాహనాలలో ఫైటర్స్ ఉండేవారని పింగ్ పాంగ్ సూర్య అన్నారు.

అడవిలో 25 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నామని సూర్య తెలిపారు.రాజమౌళి గారిలో నేను లీడర్ ను చూశానని ఆయన వెల్లడించారు.అడవిలో చెట్లు పడిపోతే వాటిని టచ్ చేస్తే కేసు అవుతుందని మేము ఆగిపోయామని రాజమౌళి గారు ధైర్యం చెప్పి ఆ చెట్లను కట్ చేయించారని ఆయన పేర్కొన్నారు.

20 నిమిషాలలో 2 చెట్లను క్లియర్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు.

బాహుబలి షూటింగ్ సమయంలో అడవిలో ఉండటంతో జలగలు రక్తం పీల్చేశాయని పింగ్ పాంగ్ సూర్య అన్నారు.చిరంజీవి గారు లెజెండ్ అని ఆయన ప్రేక్షకుల మెప్పు పొందే సినిమాలు చేయాలని భావిస్తారని ఆయన పేర్కొన్నారు.ఆ నలుగురు సినిమా నుంచి నాలో మార్పు మొదలైందని పింగ్ పాంగ్ సూర్య కామెంట్లు చేశారు.

ఆ నలుగురు సినిమా వల్లే నేను నిర్మాతగా మారి కలియుగ సినిమాకు నిర్మాతగా వ్యవహరించానని ఆయన తెలిపారు.సినిమా వాళ్లకు ఎవరూ అప్పులు ఇవ్వరని ఆయన చెప్పుకొచ్చారు.సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలన్నా పాతిక లక్షల రూపాయలు కావాలని ఆయన తెలిపారు.

గతంలో నేను ఒక కేసులో చిక్కుకోగా పాతిక లక్షల రూపాయలు ఇస్తే సెటిల్ చేస్తానని ఒక వ్యక్తి కాల్ చేశాడని పింగ్ పాంగ్ సూర్య అన్నారు.సూర్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube