ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ పై అచ్చెన్నాయుడు పరోక్ష వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.బీజేపీకి, వైసీపీకి మధ్య సంబంధం లేదని ప్రజలు అనుకోవాలన్నారు.

మనం చెప్పే మాటలను ప్రజలు నమ్మాలని వ్యాఖ్యానించారు.వైసీపీ - బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకే తెలుసని చెప్పారు.

బీజేపీపై పితాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపారు.నాలుగేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

ఉత్తరాంధ్రకు టీడీపీ ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేస్తామన్న అచ్చెన్నాయుడు వైసీపీ ఏం చేసిందో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు.

Advertisement
మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 

తాజా వార్తలు