మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను రఫ్ఫాడించేందుకు చిరు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్తో ప్రేక్షకులను అలరించనున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ చూస్తే తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా రూ.26 కోట్లకు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఇంత భారీ మొత్తంలో కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడవ్వడం మరే ఇతర తెలుగు సినిమాకు సాధ్యం కాలేదని వారు అంటున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.23 కోట్లతో రెండో ప్లేస్లో నిలిచింది.ఇక ఆచార్య సినిమాపై కేవలం సౌత్తోనే కాకుండా నార్త్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
కొరటాల మార్క్ టేకింగ్కు అక్కడ కూడా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం, ఇక ఈ సినిమాలో చరణ్ కూడా కలిసి నటిస్తుండటంతో ఆచార్య సినిమా కోసం నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమాలో చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో కనిపిస్తుండగా, అతడి సరసన అందాల భామ పూజా హెగ్డే కేమియో రోల్లో మెరవనుంది.
ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తో్న్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ నుండి ఇంకా అఫీషియల్ డేట్ రావాల్సి ఉంది.