తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఒక నిందితుడు విడుదలైయ్యాడు.కేసులో నిందితుడుగా ఉన్న సింహయాజి బెయిల్ పై విడుదల అయ్యారు.
ఈ క్రమంలో చంచల్ గూడ జైలు నుంచి ఆయన బయటకు వచ్చారని తెలుస్తోంది.అయితే బెయిల్ వచ్చిన వారం రోజుల తర్వాత సింహయాజి విడుదల అయ్యారు.
కాగా ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సింహయాజితో పాటు నందకుమార్, రామచంద్ర భారతిలు కూడా నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.