సైదాబాద్ అత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహం ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.రాజు చేతి పై మౌనిక అనే టాటూ పేరు ఉండటంతో అది రాజు మృతదేహాన్ని గుర్తించి.
పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ఇదే సమయంలో రాజు ఆత్మహత్య విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వాళ్లంతా కన్నీరుమున్నీరవుతున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే నిందితుడు రాజు ఆత్మహత్యపై బాధిత చిన్నారి తండ్రి మరియు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాజు మృతదేహాన్ని తమ కళ్ళతో చూసిన తర్వాతే నమ్ముతాం అని అంటున్నారు.
చాలామంది టాటూలు వేయించుకుంటారు అని.మృతదేహాన్ని ఒకసారి సైదాబాద్ కి తీసుకురావాలని బాధిత తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.ఏది ఏమైనా సైదాబాద్ నిందితుడి కోసం గత కొన్ని రోజుల నుండితెలంగాణ పోలీస్ వ్యవస్థ భారీగా గాలింపులు చేస్తూ ఉన్న తరుణంలో అతని మృతదేహం రైల్వే ట్రాక్ వద్ద లభ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది.ఈ విషయంలో చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు.
చొరవ తీసుకోవడం జరిగింది.