తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు.ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సోమయాజులు, నందకుమార్ లను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.
వారిని నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కు తరలించారు.ఎఫ్ఎస్ఎల్ లో నిందితులకు వాయిస్ పరిశీలన పరీక్షలు నిర్వహించారు.
ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడ్డ ఆడియో, వీడియోలోని వాయిస్ తో అధికారులు పోల్చి చూడనున్నారు.కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది.