ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయనను సీబీఐ స్పెషల్ కోర్టు ఎదుట అధికారులు హాజరుపరిచారు.అభిషేక్ ను మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.ఇండో స్పిరిట్ నుంచి రూ.3.85 కోట్లు అభిషేక్ ఖాతాలోకి వచ్చాయని సీబీఐ ఆరోపిస్తుంది.ఈ నగదు బదిలీపై అభిషేక్ రావు ఎలాంటి ఆధారాలు చూపించలేదని పేర్కొంది.
సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం మూడు కస్టడీకి అనుమతినిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.