యాదాద్రి భువనగిరి జిల్లా: బహుజన సమాజ్ పార్టీ పార్లమెంటు సెగ్మెంట్ జోన్ ఇన్చార్జిగా తనను నియమించిన బిఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఐతరాజు అభయంధర్ ధన్యవాదాలు తెలిపారు.ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వావిలపల్లి గ్రామానికి చెందిన తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు కట్టబెట్టిన నేపథ్యంలో,
తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానని తెలిపారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలో భువనగిరి ఎంపీ స్థానంలోనే కాకుండా అన్ని స్థానాలలో పోటీ చేసి బహుజనుల సత్తా చాటుతామని,భువనగిరి ఖిల్లాపై నిలిజెండా ఎగతెస్తామని ధీమా వ్యక్తం చేశారు.బెహన్ జీ కుమారి మాయావతిని ప్రధాన మంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.