కరోనా తర్వాత బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.ఒకవైపు మన సౌత్ ఇండస్ట్రీ వరుస హిట్స్ అందుకుంటూ వందల కోట్లను వసూలు చేస్తుంటే.
బాలీవుడ్ మాత్రం ఇప్పటికి కోలుకోలేక పోతుంది.అక్కడి ప్రేక్షకులు ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలను రిజక్ట్ చేస్తున్నారు, దీంతో అక్కడ పాండమిక్ తర్వాత ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు. కరోనా తర్వాత రిలీజ్ అయినా సినిమాల్లో భారీ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాలు లేవనే చెప్పాలి.మొన్న మొన్ననే వచ్చిన భూల్ భూలయ్య మాత్రం పర్వాలేదు అనేలా రెండంకెల ఓపెనింగ్స్ రాబట్టింది.
ఏది ఏమైనా భారీ ఓపెనింగ్స్ రాబట్టి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచినా ఒక్క సినిమా కూడా లేదు అనే చెప్పాలి.
ఈ మధ్య కాలంలో అక్కడ రెండెంకెల ఓపెనింగ్స్ తేవడమే గగనం అయిపోయింది.20 కోట్ల ఓపెనింగ్స్ కూడా తేలేక చేతులెత్తేస్తున్నాయి.అందుకే అక్కడ స్టార్స్ తో పాటు ప్రేక్షకులు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
అయితే తాజాగా ఈ నెల ఆగష్టు 11న రెండు భారీ ప్రాజెక్టులు రానున్నాయి.ఈ రెండు సినిమాలు అయినా పెద్ద ఓపెనింగ్స్ రాబడతాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కరీనా కపూర్ కలిసి జంటగా నటిస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా..ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా కీలక పాత్రలో నటించాడు.ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది.
అలాగే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షా బంధన్ కూడా ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.బాలీవుడ్ లోనే బిగ్ స్టార్స్ అయినా అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ ఒకే రోజు రాబోతున్నారు.దీంతో బాలీవుడ్ ప్రేక్షకుల కళ్లన్నీ ఈ సినిమాల పైనే ఉన్నాయి.మరి వీరిద్దరూ అయినా బాలీవుడ్ ను సూపర్ హిట్ తో ఆడుకుంటారో.లేదో మరింత పరువు పోయేలా చేస్తారో చూడాలి.