బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇటీవల అమీర్ ఖాన్ చేసిన మంచి పని అందరినీ ఆకట్టుకుంది.
దీంతో అందరు ఆయనని అభినందిస్తున్నారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం అస్సాంలో కుంభవృష్టి కారణంగా భారీ వర్షాల వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అస్సాంలో రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.ఎక్కడ చూసినా కూడా వరద నీరు వల్ల ప్రజలు ఇంటి నుండి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది.
అంతే కాకుండా కొన్ని ప్రాంతాలలో వరదల ముంచెత్తడం వల్ల ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి .అందువల్ల చాలా మంది ప్రజలు తల దాచుకోవటానికి ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అస్సోంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే చెరువులు, డ్యామ్ లు నిండి ఉప్పొంగిపోతున్నాయి.ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఇంటి నుండి బయటికి రావటానికి వీలు లేక కొన్నిరోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు.అంతేకాకుండా పంట పొలాలన్నీ నీటిమయం అయ్యాయి.
చేతికి వచ్చిన పంట ఇలా వరదల్లో కొట్టుకుపోవడంతో రైతులు బాధ వర్ణాతీతంగా మారింది.ఇప్పటికే ఈ వరదల కారణంగా అస్సోంలో 20 లక్షల మంది ప్రజలు నష్టపోయారు.
వీరందరూ తమని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ క్రమంలో అస్సోంలో వరదల వల్ల ఏర్పడిన నష్టానికి తన వంతు సాయం అందించాడు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్.అక్కడి ప్రజలకు సహాయ సహకారాలు అందించటానికి సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయలు విరాళంగా అందచేసి తన మంచి మనసు చాటుకున్నారు.ఈ విషయాన్ని అస్సోం సీఎం హిమంతా బీష్వ శర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.
అమీర్ ఖాన్ పెద్దమనసును కొనియాడుతూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశాడు.ఇలా వరదల కారణంగా నష్టపోయిన అస్సోం ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరాడు.
అమీర్ ఖాన్ లాగా మరికొంతమంది సినీ ప్రముఖులు అస్సోం ఆదుకునేందుకు ముందుకు వస్తారేమో చూడాలి మరి.