యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలో సోమవారం వీచిన ఈదురు గాలులకు వావిలపల్లి-చిల్లపురం గ్రామాల మధ్య నడిరోడ్డు తాటి చెట్టు విరిగిపడింది.
దీనితో కాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.
అయితే ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.మండలంలో అక్కడక్కడ గాలి దుమారాలతో కూడిన వర్షం పడింది.