విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో పెద్దపులి కలకలం రేపింది.భూపాలరాజపురంలో అర్ధరాత్రి సమయంలో ఆవుపై పులి దాడికి పాల్పడింది.
పులి సంచారంతో సమీప గ్రామ ప్రజల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.రాత్రి సమయాల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమైయ్యారు.గ్రామానికి సమీపంలో పులి పాదముద్రలను సేకరించారు.
ఈ నేపథ్యంలో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.