నిషా తలకు ఎక్కితే ఏదైనా చేసేయొచ్చు అని అనుకుంటారు.మద్యం మత్తులో మా కంటే తోపు లేడని ఫోజులు కొడతారు.
బియ్యం బస్తాను లేపి అవతల పడేస్తా.నేనే తోపు, తురుము అంటూ ప్రగల్భాలు పలుకుతారు.
మత్తులో మన శరీరంపై మనకు కంట్రోల్ ఉండదు.మాటలు అదుపులో ఉండవు.
మద్యం సేవించి ఆ మత్తులో ఇష్టారీతిగా వ్యవహరిస్తుంటారు చాలా మంది.కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.
ఓ యువకుడు మద్యం మత్తులో చేసిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలు వైరల్ గా మారింది.ఏదో అనుకున్నాడు.
ఇంకేదో జరిగింది.చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే.మద్యం సేవించి తూలుతూ ఉన్న ఓ యువకుడు.పాముతో ఆడుకోవాలనుకున్నాడు.ఆ వ్యక్తి పేరు శివ హటేకర్.
వయస్సు కేవలం 21 ఏళ్లే.ఉండేది మహారాష్ట్ర భివండీ జిల్లాలోని కొంబడపాడ ప్రాంతం.
ఆదివారం రాత్రి పీకల దాకా మద్యం సేవించాడు శివ.కొంబడపాడ ప్రాంతంలోని ఉన్న ఓ ఆలయానికి వెళ్లాడు.అదే టైంలో అతనికి ఓ పాము కనిపించింది.మద్యం మత్తు ఊరకే ఉండనివ్వదు కదా… పోయి దానిని పట్టుకున్నాడు.దానితో ఆటలు ఆడటం మొదలెట్టాడు.తోక పట్టుకుని ఆటలాడాడు.
అది అకస్మాత్తుగా అతడి పురషాంగంపై కాటు వేసింది.దీంతో వెంటనే స్థానికులు అతడిని భివండిలోని ఓ ఆస్పత్రికి తరలించారు.పరిస్థితి విషమించగా.శివను ముంబయికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ శివ ప్రాణాలు కోల్పోయాడు.