టీడీపీ అధినేత, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… ఇక కొత్త బాధ్యతల్లో కనిపించనున్నారు.ఇప్పటిదాకా పార్టీ కార్యకలాపాల్లో బిజీబిజీగా కనిపిస్తున్న లోకేశ్… మరో రెండు, మూడు నెలల్లో మంత్రిగా కనిపించనున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్ ను తన కేబినెట్ లోకి తీసుకునేందుకు చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే దీనిని అమలులోకి తీసుకురానున్నారని ఓ తెలుగు దినపత్రిక ఆసక్తికర కథనాన్ని రాసింది.
ఇప్పటికే మిత్ర పక్షం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో లోకేశ్ కు కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తే… అటు ఏపీకే కాక ఇటు తెలంగాణకు కూడా మేలు జరుగుతుందని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
అయితే తనయుడు భాగస్వామిగా ఉన్న కేంద్ర కేబినెట్ పై ఒత్తిడి తీసుకురావడం కుదరదన్న భావనతో ఈ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించలేదు.







