" పవన్ కళ్యాణ్ నోరు తెరిచి మాట్లాడు "

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భూదందా జరుగుతోందని, రైతుల వద్ద నుంచి భూములు తీసుకొని కావాల్సిన వారికి అప్పనంగా కట్టబెడుతున్నా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా నిలదీశారు.పవన్ కల్పించుకుంటే తప్పా ఈ దందా వ్యవహారం ఒక కొలిక్కి రాదని అన్నారు.

 Pawan Kalyan Speak Up!!!-TeluguStop.com

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను చూసే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారని అన్నారు.రోజా చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు, పలువురు మంత్రులు ఇప్పటికే స్పందించారు.

పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.రాజధాని భూముల విషయంలో రైతుల పక్షాన అప్పట్లో పవన్ కళ్యాణ్ నిలబడ్డసంగతి విదితమే.

రైతుల కోసం అవసరమైతే దీక్ష చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఇప్పుడు రోజా వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అన్నది తెలియాలి.

అసలు పవన్ కళ్యాణ్ రోజా వ్యాఖ్యలపై స్పందిస్తారా లేదా అన్నది కూడా త్వరలోనే తేలిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube