పారితోషికం మ్యాటర్‌ కాదంటున్న ముద్దుగుమ్మ

తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, అక్కడ వరుస విజయాలు వచ్చిన సమయంలో తెలుగులో ‘నేను శైలజ’ చిత్రంలో నటించింది కీర్తి సురేష్‌.

ఈ అమ్మడు తెలుగులో ఎంట్రీ ఇచ్చిన చిత్రం సక్సెస్‌ అయినా కూడా ఇప్పటి వరకు ఈమె రెండవ సినిమాకు ఓకే చెప్పింది లేదు.

ఇప్పటికే ఈమె వద్దకు పలువురు దర్శకులు మరియు నిర్మాతలు అవకాశం ఇచ్చేందుకు వెళ్లినా కూడా ఏవో కారణాలు చెబుతూ నో చెప్పినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలోనే మంచి సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను అంటోంది.

తాజాగా ఈ అమ్మడు పారితోషికం విషయంలో స్పందించింది.గతంలో తాను భారీగా పారితోషికాన్ని పెంచినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి తనకు పారితోషికం ముఖ్యం కాదు అని తేల్చి చెప్పింది.

తన వద్దకు ఎన్నో ఆఫర్లు వస్తాయని, అయితే కథ నచ్చితేనే నేను ఆ సినిమాలో నటిస్తాను అని, కథ మరియు అందులో నా పాత్ర నచ్చితే పారితోషికం విషయంలో పట్టు విడుపులతో వ్యవహరిస్తాను అని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.గ్లామర్‌ పాత్రలకు తాను దూరం అని, హీరోయిన్‌గా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో అయితేనే నేను నటిస్తాను అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు