ఈ సంక్రాంతికి నందమూరి హీరోల మధ్య బిగ్ ఫైట్ జరుగబోతున్న విషయం తెల్సిందే.బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, అంతకు ఒక్క రోజు ముందే అంటే ఈనెల 13న ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఎదురు అయ్యింది లేదు.నందమూరి ఫ్యాన్స్ ఈ పరిస్థితికి ఆందోళన చెందుతున్నారు.
అయితే ఈ పరిస్థితికి ప్రధాన కారణం బాలకృష్ణ పంథం అని కొందరు అంటున్నారు.
ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే అంటే దాదాను 8 నెలల క్రితమే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు.
అప్పటి నుండి కూడా సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల అంటూ పబ్లిసిటీ చేస్తారు.‘నాన్నకు ప్రేమతో’ చిత్రం సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు అనే విషయం తెలిసి కూడా బాలకృష్ణ తన ‘డిక్టేటర్’ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేస్తాం అంటూ ప్రకటించాడు.
ముందు ఎన్టీఆర్ సంక్రాంతికి వస్తాను అని చెప్పిన తర్వాతే బాలయ్య కూడా సంక్రాంతికి వస్తాను అని చెప్పాడు కనుక ఇక్కడ తప్పు అంతా బాలయ్యదే అని, బాలయ్య పోటీ తత్వం వల్లే వార్ జరుగుతుందని అంటున్నారు.బాలయ్య సంయమనంతో ఆలోచించి ఉంటే బాగుండేదని కొందరు అంటున్నారు.
‘డిక్టేటర్’ యావరేజ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఏమాత్రం వచ్చే ఛాన్స్ లేదని విశ్లేషకులు అంటున్నారు.