అఖిల్‌ వాయిదా.. ఆ రెండు విడుదల

అక్కినేని అఖిల్‌ హీరోగా పరిచయం కాబోతున్న ‘అఖిల్‌’ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.

అయితే కొన్ని టెక్నికల్‌ కారణాల వల్ల సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేక పోతున్నాం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

ఎప్పుడు ‘అఖిల్‌’ చిత్రాన్ని విడుదల చేస్తారు అనే విషయాన్ని మాత్రం యూనిట్‌ సభ్యులు ప్రకటించలేదు.‘అఖిల్‌’ విడుదల వాయిదాతో దసరా బరిలోకి రెండు చిత్రాలు వచ్చి చేరాయి.

ఈనెల 22న ‘అఖిల్‌’ స్థానంలో మెగా మూవీ ‘కంచె’ మరియు నందమూరి మూవీ ‘షేర్‌’లు రాబోతున్నాయి.వరుణ్‌ తేజ్‌ హీరోగా ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా రెండవ ప్రపంచ యుద్ద నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ప్రముఖ దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన ‘కంచె’ చిత్రం ఈనెల 2నే రావాల్సి ఉన్నా కూడా వరుసగా భారీ చిత్రాలు ఉండటం వల్ల సేఫ్‌ జోన్‌లో రావాలనే ఉద్దేశ్యంతో విడుదల వచ్చే నెలకు వాయిదా వేశారు.

తాజాగా ‘అఖిల్‌’ చిత్రం వాయిదాతో చిత్ర యూనిట్‌ సభ్యులు దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.ఇక ‘పటాస్‌’ చిత్రంతో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిన కళ్యాణ్‌ రామ్‌ ‘షేర్‌’తో సక్సెస్‌ను కొనసాగిస్తాడని నమ్మకంతో ఉన్నాడు.

Advertisement

ఈ రెండు చిత్రాలు కూడా ఒకే రోజు విడుదల అవుతుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రంది పై చేయి అవుతుందో చూడాలి.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు