అవును, త్వరలో మనం మెగాస్టార్ ని తెరపై చుడనున్నాం.అయితే అది ఆయన 150వ చిత్రంలో’ కాదు.మరి ?
రామ్ చరణ్ -శ్రీను వైట్ల కలయికలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం విదితమే.“మెరుపు అనే టైటిల్ ఫిక్స్ చేసారు.రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.దర్శకుడు శ్రీను వైట్లకి ఎప్పుడు ఎదో విశేషం సినిమాలో ఉండేలా చూసుకోవడం అలవాటే.అయితే ఈసారి అతి ఘనంగా ఉండబోతోంది ఒక సర్ప్రైజ్.
అది ఏంటంటే … మెరుపులో మెగాస్టార్ అతిథి పాత్రలో కనిపించనున్నారు.
అక్కడితో ఆగకుండా ఒక పాటలో చిందులేయనున్నారు.ఇంకో విశేషం ఏమిటంటే … ఆ స్పెషల్ సాంగ్ లో ఇలియానా ఉంటే ఇంకా అదిరిపోతుంది అని దర్శకుడు శ్రీను వైట్ల భావిస్తున్నారంట.
ఇది కేవలం గాలి వార్త కాకుండా నిజమైతే బాగుంటుంది కదా.







