బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకు పోతుంది ముద్దుగుమ్మ శృతిహాసన్.తెలుగులో ప్రస్తుతం మహేష్బాబుతో ‘శ్రీమంతుడు’ అనే సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ఆ మద్య నాగార్జున మరియు కార్తీలు హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి నిర్మాణంలో ఇటీవలే ప్రారంభం అయిన ఈ సినిమా నుండి తాజాగా శృతిహాసన్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఈమె నటిస్తున్న ‘శ్రీమంతుడు’ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఈ మల్టీస్టారర్ మూవీని వదులుకోవాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ముందుగా అనుకున్న దాని ప్రకారం ‘శ్రీమంతుడు’ సినిమా ఏప్రిల్లో పూర్తి కావాల్సి ఉంది.కాని షూటింగ్ మే చివరి వరకు కూడా పూర్తి అయ్యే అవకాశాలు లేవు.
దాంతో నాగార్జున మల్టీస్టారర్ మూవీని శృతిహాసన్ వదులుకుంది.ప్రస్తుతం ఆ సినిమా దర్శకుడు మరో హీరోయిన్ను వెదికే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ఈమె ఇప్పటికే తమిళ మరియు హిందీ సినిమాలతో బిజీగా ఉంది.







