పాలకొండ నగరపంచాయతీ లో ఇక మరింతగా అవినీతి చోటు చేసుకుంటుంది అని వినిపిస్తుంది .ఎందుకంటె ఒకసారే ఏసిబి రైడింగ్ చేస్తుంది .
మళ్లీ మళ్లీ చెయదు.అలా చేసినట్టు రైడింగ్ చరిత్రలో ఇంతవరకు నమోదు కాలేదు అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు తినమరిగిన మున్సిపల్ ఉద్యోగులు .కమీషనర్ స్థానం లో కొత్తగా ఎవరూ రారు.కింది ఉద్యోగినే ఆక్టింగ్ కమీషనర్ గా వేస్తారు.
అతడు మద్యవర్తితో మొత్తం అవినీతి కథను నడిపెస్తాడు అని ఆకార్యాలయం లోనే వినిపిస్తున్నాయి.వాస్తవానికి కమీషనర్ ట్రాప్ లో దొరికిపోయాడే అనే ఆలోచన భయం అక్కడ స్టాఫ్ కు లేదు అని పాలకొండ వాసులే చెప్పుకుంటున్నారు
ఏ సి బి అధికార్లు ఉత్తరాంధ్ర ప్రాంతం లో మున్సిపాలిటీలలో చాలా అవినీతి కథలు విన్నారు .ఒకసారి పంజా విసురుదామా అని ఎప్పటికప్పుడు అనుకుంటున్నారు.బాధితులు డైరెక్టుగా అయ్యా మాకు ఇంత డిమాండు చేస్తున్నాడు మా పాలకొండ కమీషనర్ అని ఆఫీసు గుమ్మంలో తచ్చాడలేదు.
అలా తచ్చాడితే గాని పోవడానికి లేదు అని అదను కోసం చుసారు అధికార్లు .ఒక బాధితుడు రాకనే వచ్చాడు అయ్యా మాది పాలకొండ మా నగర పంచాయతి కమీషనర్ నా ఇంటి ప్లాన్ కు 12500రూపాయిలు అడిగాడు అని గగ్గోలు పెట్టాడు.వెదకబోయే పార్టీ ముంగిట్లోకి వచ్చాడని ఏ సి బి అధికార్లు సంబరపడి వాళ్ళతో వెళ్లి పట్టేశారు కమీషనర్ కటకటాలపాలయ్యాడు .