నల్లగొండ జిల్లా:కంచ గచ్చిబౌలి భూముల్లో నేడు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది.స్థలాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది.
అనంతరం ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుంది.
దాన్నిబట్టి అత్యున్నత న్యాయస్థానం విచారణ కొనసాగించనుంది.
ఆ భూములను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా హెచ్.సి.యు విద్యార్థులతో పాటు సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి.చివరికి ఎస్సి జోక్యంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.