నల్లగొండ జిల్లా:రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మాదిగలు బుద్ధి చెబుతారని ఎమ్మెస్ఎఫ్ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు నల్ల శ్రీకాంత్ అన్నారు.గత సంవత్సరం ఆగస్టు 1న సుప్రీంకోర్టు వర్గీకరణకు రాష్ట్రాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పిన వెంటనే నిండు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి వర్గీకరణ అమలు చేయకుండానే,
గ్రూప్-1,గ్రూప్-2 తో పాటు అన్నిరకాల ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నారని,వాటిని వెంటనే నిలిపివేయాలని నల్ల బ్యాడ్జీలతో బుధవారం దేవరకొండలో నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్లె అనిల్,రోహిత్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.







