పాకిస్తాన్‌లో రైలు హైజాక్.. హైజాక్ ఇలా జరిగిందంటే (వీడియో వైరల్)

పాకిస్తాన్‌లో( Pakistan ) సంచలన ఘటన చోటుచేసుకుంది.బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్( Jaffer Express ) రైలును బలూచ్ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు.

 Bla Has Released Its First Video On The Hijacking Of Jaffar Express Details, Pa-TeluguStop.com

ఈ దాడిలో 100 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు.కాగా, ఈ ఘటనకు సంబంధించి మొత్తం దాడి ప్రణాళికను తెలియజేసే వీడియోను బలూచ్ లిబరేషన్ ఆర్మీ ( BLA ) విడుదల చేయడం మరో సంచలనం రేపుతోంది.

ఈ ఘటన మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది.జాఫర్ ఎక్స్‌ప్రెస్ క్వెట్టా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సిబ్బికి చేరుకోవాల్సి ఉండగా, మార్గమధ్యలో బోలాన్‌లోని మష్పాక్ టన్నెల్ వద్ద దాడి జరిగింది.ఈ ప్రాంతం పూర్తిగా కొండలతో చుట్టుముట్టబడి ఉండటంతో రైలు వేగాన్ని తగ్గించాల్సి వచ్చింది.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న బలూచ్ తిరుగుబాటుదారులు, ముందుగా సొరంగం-8 వద్ద భారీ పేలుడు జరిపారు.దీంతో రైలు పట్టాలు తప్పి నిలిచిపోయింది.

ఈ దాడిని బలూచ్ లిబరేషన్ ఆర్మీ అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించింది.మష్పాక్ టన్నెల్ వద్ద వారంతా ముందుగా ఏర్పాటుచేసుకుని, రైలు ఆగిన వెంటనే ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు.ఈ దాడి కోసం ప్రత్యేకంగా మజీద్ బ్రిగేడ్, ఫతే గ్రూప్‌లను సిద్ధం చేశారు.వీరు కొండలపై ముందుగా స్థిరపడినట్లు విడుదలైన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.తుపాకులతో ప్రయాణికులను అదుపులో ఉంచుతూ, రైలును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పాకిస్తాన్ సైన్యం వెంటనే ఆపరేషన్ ప్రారంభించింది.ఇప్పటివరకు 150 మందిని రక్షించగలిగినప్పటికీ, 100 మందికి పైగా ప్రయాణికులు ఇంకా బలూచ్ తిరుగుబాటుదారుల చెరలోనే ఉన్నారు.అయితే, ఈ ప్రాంతం పూర్తిగా కొండలతో ముట్టుముట్టబడి ఉండటం, మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ కష్టతరమవుతోంది.

హైజాక్ చేయబడిన రైలు ప్రస్తుతం బోలాన్ పాస్ వద్ద నిలిచి ఉంది.ఈ ప్రాంతం పూర్తిగా సొరంగాలు, కొండలతో ముట్టుముట్టబడి ఉంది.మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం లేకపోవడంతో కమ్యూనికేషన్ లోపాలు ఏర్పడుతున్నాయి.పాకిస్తాన్ సైన్యం ఈ ఘటనను అదుపులోకి తీసుకునేందుకు భారీ స్థాయిలో చర్యలు తీసుకుంది.

ఈ హైజాక్ ఘటన పాకిస్తాన్‌లో భద్రతా లోపాలపై ప్రశ్నలు తలెత్తేలా చేసింది.ముఖ్యంగా బలూచ్ తిరుగుబాటుదారుల దాడులు పెరుగుతుండటంతో, ప్రయాణికుల భద్రతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube