37 ఏళ్ల తర్వాత మహా కుంభమేళాలో( Maha Kumbh Mela ) స్నేహితులు కలిశారు.ఓ ఫైర్ ఆఫీసర్, ఆయన కాలేజ్ ఫ్రెండ్( College Friend ) వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.సంజీవ్ కుమార్ సింగ్,( Sanjeev Kumar Singh ) రష్మి గుప్తా,( Rashmi Gupta ) వీళ్లిద్దరూ 1988లో కలిసి చదువుకున్నారు.
అనుకోకుండా మహా కుంభమేళాలో కలుసుకున్నారు.వాళ్ల ఎమోషనల్ మీటింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
వీడియోలో సంజీవ్ ఎంతో సంతోషంగా రష్మిని అందరికీ పరిచయం చేశారు.“ఈమె నా క్లాస్మేట్, రష్మి.మేం 1988 బ్యాచ్.37 ఏళ్ల తర్వాత మళ్లీ మహా కుంభమేళాలో కలిశాను.ఇప్పుడు లక్నోలో కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది.” అని నవ్వుతూ చెప్పారు.

రష్మి కూడా తన కాలేజ్ ఫ్రెండ్ని చూసి చాలా సంతోషపడ్డారు.మహా కుంభమేళాలో ఏర్పాట్లు చాలా బాగున్నాయని, మళ్లీ స్నేహితుడిని కలవడం ఆనందంగా ఉందని చెప్పారు.“ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను.ఏర్పాట్లు సూపర్ ఉన్నాయి.
సంజీవ్ చాలా హెల్ప్ చేస్తున్నాడు.కానీ కాలేజ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా సైలెంట్గా ఉండేవాడు, ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదు.
ఇప్పుడు చూస్తే పూర్తిగా మారిపోయాడు.మళ్లీ ఇన్నేళ్లకు కలవడం చాలా హ్యాపీగా ఉంది.” అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంజీవ్ వెంటనే కాలేజ్ రోజుల్లో జరిగిన సరదా సంఘటనలను గుర్తు చేసుకున్నారు.“రష్మి, తన ఫ్రెండ్స్ అప్పట్లో నాతో పెద్దగా మాట్లాడేవారు కాదు” అని సరదాగా అన్నారు.రష్మి నవ్వారు.వెంటనే సంజీవ్ నవ్వుతూనే “ఇప్పుడు నువ్వు ఇచ్చే ఫేక్ కాంప్లిమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాను.” అని పంచ్ వేశారు.
పాత స్నేహం ఎంత గొప్పదో, అనుకోకుండా కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.అందుకే ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.







