సీతాకోకచిలుకలతో చాలా డేంజర్.. వాటితో గేమ్ ఆడి 14 ఏళ్ల కుర్రాడు దుర్మరణం..

సోషల్ మీడియాలో పిచ్చి ట్రెండ్స్‌కు హద్దు లేకుండా పోతోంది.కొంతమంది చేసే వెర్రి చేష్టలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి.బ్రెజిల్‌లో( Brazil ) తాజాగా జరిగిన ఒక ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది.14 ఏళ్ల దావి నూన్స్ మొరెయిరా( Davi Nunes Moreira ) అనే కుర్రాడు చనిపోయిన సీతాకోకచిలుకల( Butterflies ) శరీర భాగాలను మెత్తగా నూరి నీళ్లలో కలిపి ఇంజెక్ట్ చేసుకున్నాడు.కట్ చేస్తే ప్రాణాలు కోల్పోయాడు.అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Brazilian Teen Dies From Injecting Butterfly Into Veins In Viral Challenge Detai-TeluguStop.com

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, సీతాకోకచిలుకల్లో ఉండే విష పదార్థాల వల్ల సెప్టిక్ షాక్( Septic Shock ) వచ్చిందని అనుమానిస్తున్నారు.సెప్టిక్ షాక్ అంటే బాడీలో ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయి, బీపీ పడిపోయి, ఒక్కొక్కటిగా బాడీ పార్ట్స్ పనిచేయడం ఆగిపోవడం.

అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాకే అసలు కారణం ఏంటో తెలుస్తుందంటున్నారు.

Telugu Brazilian Teen, Butterfly, Trends, Davi Moreira, Septic Shock, Teen, Tham

ఇది ఏదైనా ఆన్‌లైన్ ఛాలెంజ్( Online Challenge ) వల్ల జరిగిందా అని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.కానీ చనిపోయే ముందు దావి మాత్రం తను ఎలాంటి ఆన్‌లైన్ ట్రెండ్‌నూ ఫాలో అవ్వలేదని చెప్పాడట.ఇంకోపక్క డైలీ మెయిల్ కథనం ప్రకారం, దావి తండ్రి అతని రూమ్ క్లీన్ చేస్తుంటే దిండు కింద ఒక సిరంజి దొరికిందట.

అది కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి పోలీసులకు ఉపయోగపడొచ్చు.

Telugu Brazilian Teen, Butterfly, Trends, Davi Moreira, Septic Shock, Teen, Tham

సీతాకోకచిలుకల్లో ఉండే బాడీ ఫ్లూయిడ్స్ మనుషుల మీద ఎలా పనిచేస్తాయనే దానిపై ఇంకా పెద్దగా స్టడీస్ జరగలేదట.కొన్ని సీతాకోకచిలుకలు విషపూరితమైన మొక్కల్ని తింటాయి.వాటిని తిన్న సీతాకోకచిలుకల్ని వేరే జంతువులు తింటే అవి కూడా చనిపోయే ప్రమాదం ఉంది.

కానీ చాలా సీతాకోకచిలుకల్లో ఉండే విషం మనుషులకు అంత ప్రమాదకరం కాదని, అది కూడా తక్కువ మోతాదులో ఉంటే ఏమీ కాదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

ఇలాంటి పిచ్చి పిచ్చి వైరల్ ఛాలెంజ్‌ల వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం ఇదేం మొదటిసారి కాదు.

గతేడాది ఏప్రిల్‌లో థామీ MC అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక డేంజర్ ఛాలెంజ్‌లో పాల్గొని దెబ్బలు తెచ్చుకుంది.ఐస్ ముక్కలు వేసిన బకెట్‌లో ఎక్కువసేపు కాలు పెట్టి కూర్చుని ఫ్రాస్ట్‌బైట్‌కు గురైంది.

కాలు కండరాలు దెబ్బతిని నల్లగా మారిపోయాయి.ఒక్క నిమిషం ఎక్కువ సేపు ఉంటే చర్మం కట్ చేయాల్సి వచ్చేదని, లేదా ప్రాణాంతకమైన బ్లడ్ క్లాట్స్ కూడా వచ్చేవేమో అని డాక్టర్లు వార్నింగ్ ఇచ్చారు.

ఇలాంటి వెర్రి ట్రెండ్స్‌ను చూసి గుడ్డిగా ఫాలో అవ్వొద్దని ఎక్స్‌పర్ట్స్ అందరూ హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా టీనేజర్స్ ఇలాంటి లైఫ్ రిస్క్ ఉండే ఛాలెంజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube