రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లోని హరిహర ఫంక్షన్ హాల్ వద్ద రెండు సంవత్సరాల బాలిక హన్సిక మిస్సింగ్ అయింది.అయితే కోడిమ్యాల నుండి రమేష్ – రమ్య దంపతులు నిన్నటి రోజున బందువుల పెళ్లి కోసం వేములవాడ కి వచ్చారు.
రాత్రి బందువుల ఇంటి వద్దనే ఉండగా తెల్లవారు జమున బాలిక మిస్సింగ్ అయింది.
అయితే ఆడుకుంటూ రోడ్డు దాటి ముందుకు చాలా దూరం వెళ్ళింది.
కుటుంబ సభ్యులు ఎంత వెతికినా దొరక లేదు.వెంటనే కుటుంబ సభ్యులు పోలీస్ లకి సమాచారం ఇచ్చారు.
అయితే దర్యాప్తు లో భాగంగా ప్రభు అనే యువకుడి కి పాప దొరకడంతో పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు.తల్లిదండ్రులకి బాలిక ను అప్పగించారు.







