ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇది ఇలా ఉంటే.
మరికొందరు సోషల్ మీడియాలో ( social media) ఫేమస్ కావడానికి చిత్ర విచిత్ర ప్రమాద పనులు చేస్తూ చివరికి ప్రాణాలు మీదకు తెచ్చుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు.తాజాగా అచ్చం ఇలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకుంది.
తాజాగా ఓ వ్యక్తి రీల్స్ చేయడం కోసం రైల్వే ట్రాక్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
రైల్వే ట్రాక్ పై(Railway track) ముగ్గురు పిల్లలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడం కనపడుతుంది.వారు నిల్చున్న చోట రైలు ఎదురుగా వస్తున్న కాని రైలు చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు.అయితే ఈ వీడియో ఎక్కడ జరిగింది? అతడు విషయాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు.ఇకపోతే, ఈ వీడియోలో మొదటగా ముగ్గురు పిల్లలు రైల్వే ట్రాక్ పై వెళ్లి డాన్స్ చేయడం కనపడుతుంది.
అయితే, వారు నిలబడిన ట్రాక్ ఎదురుగా చాలా వేగంతో రైలు వస్తుంది.రైలు వస్తున్న విషయం తెలిసి కూడా వారు రీల్స్ చేయడం ఆపలేదు.అలా రైలు దగ్గరికి వచ్చిన తర్వాత ముగ్గురు రైలు ట్రాక్ మీద నుంచి కిందికి దిగారు.ఆ తర్వాత కూడా గూడ్స్ రైలు వారి వెనుక వెళ్తున్న రీల్స్ కు ఫోజులు ఇవ్వడం మాత్రం కొనసాగించారు.
ఇలా ఉండగా.ఆకస్మాత్తుగా ఏదైనా వెళ్తున్న రైలు దగ్గర నిలబడిన తలను ఒక్కసారిగా ఢీకొట్టింది.దీంతో యువకుడు నేలపై చలనం లేకుండా పడిపోయాడు.దాంతో కెమెరా రికార్డింగ్ ఆగిపోయింది.దాని తర్వాత అతడికి ఏమైందన్న విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు.ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి వారికి తగిన శిక్ష పడిందంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.
రీల్స్ (reels)చేయాలి కానీ మరి ప్రాణాల మీదికి తెచ్చుకునేంత పని చేయకూడదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.ఏది ఏమైనా ఇలాంటి డేంజరస్ రీల్స్(Dangerous Reels) చేయడం కాస్త తగ్గించుకుంటే చాలా మంచిది.