సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని పెద్దుర్ కి చెందిన బడుగు భగత్ అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ,ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 2,50,000/- రూపాయలు మంజూరు చేపించారు.
అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,మంత్రి పొన్నం ప్రభాకర్ కి, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ మంగ కిరణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్, బీసీ సెల్ టౌన్ ప్రధాన కార్యదర్శి సలేంద్రి వేణుగోపాల్ యాదవ్, బడుగు భరత్, రెడ్డిమల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.







