సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.అందులో ఒకే స్థలంలో నిరంతరం జరిగే సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి చూపబడతాయి.
వీడియోలో సీసీటీవీ కెమెరాలో (CCTV) రికార్డ్ చేసిన వివిధ సంఘటనలు ఉన్నాయి.వీటిలో చాలా జంతువులు( Animals ) రోడ్డును దాటుతూ ఉన్నాయి.
జంతువుల వల్ల ఏదో జరుగుతోందని, మిగతా ఘటనలు ఎలా జరుగుతున్నాయని ఈ వీడియో ప్రజల్లో ఆందోళన, ఆశ్చర్యం కలిగించింది.
రోడ్డు ప్రమాదాల( Road Accidents ) నుంచి అకస్మాత్తుగా జరిగే వింత ఘటనల వరకు ఒకే చోట( Same Spot ) మళ్లీ మళ్లీ జరుగుతున్న ఘటనలు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నాయి.
జంతువులు రోడ్డుపై పరుగులు తీయడం.వాహనాల ముందు వచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నట్లు కొన్ని వీడియోల్లో కనిపించాయి.జంతువుల వల్ల బైక్పై వెళ్లేవారు పడిపోవడం కొన్ని ఘటనల్లో కనిపిస్తోంది.
ఈ ప్రదేశం ఇప్పటికే ప్రమాదకరంగా ఉందని, ప్రతిరోజూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.అయితే, ఈ వీడియో బయటకు రావడంతో ప్రజలు ఇక్కడ భద్రతా చర్యలు తీసుకోవాలని పరిపాలనను డిమాండ్ చేశారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో జంతువుల ఉనికిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కొందరు తెలిపారు.
అలాగే ఈ వీడియో ఎక్కడిది అనే సమాచారం ఇంకా తెలియరాలేదు.అయితే వీడియోలో ఉన్న బోర్డు పై ఉన్న అక్షరాలు చూస్తే ఉత్తర భారతదేశంలోని( North India ) ఓ ప్రాంతం అయ్యి ఉండవచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగే ప్రాంతంలో వాహనదారులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ చాలామంది కామెంట్ చేస్తుండగా.
మరి కొంతమంది., మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ఎదుటోడి వల్ల కూడా అపాయం ఎదురవుతుంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.