ప్రమాదకరంగా మారిన రోడ్డుపై గుంత...పట్టించుకోని అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్ మహాలక్ష్మి వీధి సమీపంలో ఎల్ఐసీ ఆఫీస్ ఎదురుగా జగిత్యాల బస్ స్టాండ్ నుండి తిప్పపూర్ బస్ స్టాండ్ కు వెళ్లే ప్రధాన రహదారి పై పైపు లికేజీ అయి పెద్ద గుంత ఏర్పడి వచ్చి వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.గుంతపడి రోజులు గడుస్తున్న అధికారులు మాత్రం స్పందించడం లేదు.

 The Officials Who Did Not Care About The Pothole On The Dangerous Road , Jagitya-TeluguStop.com

ఆ గుంత కాస్త రోజురోజుకు పెరిగిపోతూ ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది.ఆ పైపు లికేజి అవడంతో రోడ్డు మొత్తం నీటితో నిండుకుపోయింది.

రోడ్డు పై నీరు నిండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.ఎన్ని సార్లు అధికారులు మరమ్మత్తులు చేసిన ఇదే పరిస్థితి నెలకొంటుంది ఇప్పటికైనా అధికారులు దీనిపై ప్రత్యేక ద్రుష్టి సారించి మరమ్మత్తులు చేపట్టి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube