తెలుగు ప్రేక్షకులకు రచయిత విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలకు రచయితగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయేంద్ర ప్రసాద్.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Star Director Rajamouli ) తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇకపోతే విజయేంద్ర ప్రసాద్ కు టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం.
ఎంత ఇష్టం అంటే పూరీ జగన్నాథ్ ఫోటోని విజయేంద్ర ప్రసాద్ వాల్ పేపర్ గా పెట్టుకునే అంత ఇష్టం అని చెప్పవచ్చు.
![Telugu Purijagannadh, Puri Jagannath, Tollywood, Vijendra Prasad, Wall Paper-Mov Telugu Purijagannadh, Puri Jagannath, Tollywood, Vijendra Prasad, Wall Paper-Mov](https://telugustop.com/wp-content/uploads/2024/08/puri-jagannadh-about-vijayendra-prasad-callc.jpg)
చాలా సందర్భాలలో ఇదే విషయాన్ని స్వయంగా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.అంతే కాకుండా సందర్భం వచ్చిన ప్రతిసారి పూరి జగన్నాథ్ ( Puri Jagannath )పై తనకున్న ఇష్టాన్ని బయటపెడుతూ వచ్చారు.ఇది ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే.డబుల్ ఇస్మార్ట్ ప్రీరిలీజ్( Double Smart Prerelease ) ఈవెంట్ లో తనకి చేసిన ఓ ఫోన్ కాల్ గురించి చెప్పారు.
ఈ మేరకు పూరి జగన్నాథ్ స్పందిస్తూ.విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఫోన్ చేశారు.
నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు.తీసే ముందు నాకు కథ చెప్పండి, మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్ అవ్వడం నేను చూడలేను.
చిన్న చిన్న తప్పులు ఏవైనా చేస్తుంటారు.
![Telugu Purijagannadh, Puri Jagannath, Tollywood, Vijendra Prasad, Wall Paper-Mov Telugu Purijagannadh, Puri Jagannath, Tollywood, Vijendra Prasad, Wall Paper-Mov](https://telugustop.com/wp-content/uploads/2024/08/puri-jagannadh-about-vijayendra-prasad-calld.jpg)
కానీ సినిమా తీసే ముందు ఒకసారి చెప్పండి అని ఆయన కోరారు అని తెలిపారు విజయేంద్ర ప్రసాద్.ఆ ఒక్క ఫోన్ కాల్ తో చాలా ఎమోషనల్ అయిపోయాను.నామీద ఆయనకి వున్న ప్రేమ, అభిమానంతో ఆ కాల్ చేశారు.
అయితే తర్వాత ఆయనకి కథ చెప్పలేదు.మనకి తెలిసిన పనే కదా కాస్త వొళ్ళు దగ్గర పెట్టుకొని తీసిన ఆయన్ని కలుద్దామని చెప్పలేదు.
ఇది వొళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా అని చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.