బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.ఇక ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారనే విషయం గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఇప్పటికే కొంతమందికి సంబంధించిన ఏవి షూట్స్ పూర్తి అయ్యాయని అలాగే వారికి అఫీషియల్ గా మెయిల్స్ కూడా వెళ్లాయని తెలుస్తుంది.
![Telugu Amardeep, Bigg Boss, Nagarjuna, Tejaswini Gouda, Tollywood-Movie Telugu Amardeep, Bigg Boss, Nagarjuna, Tejaswini Gouda, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/Tejaswini-Gouda-Amardeep-Bigg-Boss-8-nagarjuna-Remuneration-tollywood.jpg)
ఈ విధంగా అఫీషియల్ మెయిల్ వెళ్లిన వారిలో బుల్లితెర నటుడు మాజీ బిగ్ బాస్( Bigg Boss ) రన్నర్ అమర్ దీప్ ( Amar Deep ) భార్య, బుల్లితెర నటి తేజస్విని గౌడ( Tejaswini Gouda ) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతుందని తెలుస్తోంది.ఇప్పటికే ఈమెకు బిగ్ బాస్ కన్ఫర్మ్ అయినట్టు సమాచారం.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం తేజస్విని గౌడ తీసుకుని రెమ్యూనరేషన్ (Remuneration ) కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది.
పెళ్లికి ముందు వరుస సీరియల్స్ లో నటిస్తున్న ఈమె ఇటీవల కాలంలో ఎలాంటి సీరియల్స్ చేయలేదు కేవలం బుల్లితెర డాన్స్ షో కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
![Telugu Amardeep, Bigg Boss, Nagarjuna, Tejaswini Gouda, Tollywood-Movie Telugu Amardeep, Bigg Boss, Nagarjuna, Tejaswini Gouda, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/08/bigg-boss-8-Tejaswini-Amardeep-Bigg-Boss-8-Remuneration-tollywood.jpg)
అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అభిమానులను సందడి చేస్తున్నారు అయితే ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడం కోసం తన భర్త కంటే మూడింతలు రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.అమర్ ఒక వారానికి 1.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా తేజస్విని మాత్రం 4.75 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.తేజస్విని ఇలా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడానికి పెద్దగా ఆమె సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజీగా లేరు కానీ ఇంత రెమ్యూనరేషన్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారన్న విషయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.