డాక్టరేట్ పట్టా ( అవార్డు ) పొందిన రాచర్ల గొల్లపల్లి యువకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గుర్రాల విజయ్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేదం నాడి వైద్యరంగంలో తన సేవలందిస్తున్నాడు.ఈ సేవలను గుర్తించిన ఎషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ,హోసూరు, తమిళనాడు వారు గుర్రాల విజయ్ రెడ్డి కి గౌరవప్రదమైన డాక్టరేట్ అవార్డును శనివారం క్లారెస్టా హోటల్స్, హోసూర్ తమిళనాడు లో అందజేశారు.

 Racherla Gollapally Is A Young Man Who Has Received A Doctorate Degree, Racherla-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన మాస్టర్ వి.బాబు విజయన్ ఎషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపకులు & అడ్వైసరి బోర్డు, డా.కె.ఎ.మణికరణ్, ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు,డా.జ్ఞానశేఖర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కృష్ణగిరి లు గుర్రాల విజయ్ రెడ్డి ని అభినందించి గౌరవ ప్రధమైన డాక్టరేట్ అవార్డుని ప్రధానం జేయడం జరిగింది.

ఈ సందర్భంగా విజయ్ రెడ్డి మాట్లాడుతూ వైద్యరంగంలో తన సేవలను గుర్తించి తమిళనాడులో ఈ అవార్డును అందుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.డాక్టర్ పట్టానందుకున్న విజయ్ రెడ్డిని రాచర్ల గొల్లపల్లి గ్రామస్తులు అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube