సూర్యాపేట జిల్లా: తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.సోమవారం పెన్ పహాడ్ మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ 63 చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం వస్తుందని కొత్తగా పెళ్లైన వారు ఆశపడ్డారని,వారి ఆశలు అడియాశలయ్యాయన్నారు.
తీరా చూస్తే గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన చెక్కులే ఇచ్చారన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మహీందర్ రెడ్డి, ఎంపిడిఓ,మార్కేట్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, జనికిరాంరెడ్డి,మహిళలు పాల్గొన్నారు.