సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) సినీ కెరీర్ లోని హిట్ సినిమాలలో మురారి సినిమా( Murari movie ) ఒకటి.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.
ఈ సినిమా త్వరలో రీరిలీజ్ కానుండగా సినిమా రీరిలీజ్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.మహేష్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
మురారి ఫ్లాప్ అని నెటిజన్ కామెంట్ చేయగా ఆ కామెంట్ గురించి కృష్ణవంశీ( Krishnavamdsi ) ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు.మురారి నిర్మాత నుంచి తూర్పు గోదావరి హక్కులను నేను అప్పట్లోనే 55 లక్షల రూపాయలకు కొనుగోలు చేశానని కృష్ణవంశీ తెలిపారు.
ఐదేళ్లకు ఆ జిల్లా హక్కులను నేను కొన్నానని ఆయన చెప్పుకొచ్చారు.ఫస్ట్ రన్ లో కోటీ 35 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయని కృష్ణవంశీ అన్నారు.
వసూళ్లే సినిమాకు ప్రాతిపదిక అయితే సినిమా ఫ్లాపో హిట్టో కామెంట్ చేసిన నెటిజన్ నిర్ణయించుకోవాలని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.మహేష్ బాబుకు సైతం ఈ సినిమా అంటే ఎంతో ఇష్టమని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.అంతఃపురం సినిమాలో సౌందర్య చీర రంగులు మారడం ఎడిటర్ చేసిన మార్పు అని ఆయన పేర్కొన్నారు.మురారి సినిమాలో ప్రతి సీన్ ఇష్టమైన సీన్ అని ఆయన తెలిపారు.
మహేశ్ గొప్ప వ్యక్తి అని సినిమా కోసం 1000 శాతం వర్క్ చేస్తాడని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.మహేష్ బాబును ఈ మధ్య కాలంలో కలవలేదని ఆయన పేర్కొన్నారు.మురారి సినిమాలో వసుంధరా దాస్ ను ఎంచుకోవాలని అనుకున్నానని ఆయన వెల్లడించారు.కృతిశెట్టితో తప్పకుండా సినిమా చేస్తానని ఆమెలో ఎనర్జీ బాగుంటుందని కృష్ణవంశీ తెలిపారు.పైసా మూవీ సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలున్నాయని ఆయన అన్నారు.