రాజన్న సిరిసిల్ల జిల్లా : గత ఐదు సంవత్సరాలుగా బాధ్యతగా తన విధులను నిర్వహించానని జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయగా చివరి సమావేశం సందర్భంగా జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు భావోద్వేగంగా మాట్లాడారు.
ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు తనను జడ్పీటీసీగా ఎన్నుకున్నాక మండలానికి బాధ్యతగా పనిచేశానని జిల్లా నుంచి జెడ్పీ నిధులు ఎల్లారెడ్డిపేటకు తీసుకు వచ్చానని పేర్కొన్నారు.
ఐదు సంవత్సరాల పాటు ఈ పదవిని ఇచ్చిన మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా రానున్న కాలంలో ఈ మండలానికి సేవ చేస్తానని స్పష్టం చేశారు.
తనకు సహకరించిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు కు శాలువా కత్తి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య,ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.