కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మృగశిరకార్తె, మిరుగు, ఈ నెల 8న నిర్వహించనున్నారు.వాతావరణంలో కలిగే మార్పులకు అనుగుణంగా పండుగలు జరుపు కొంటారని, రైతులు చెబుతున్నారు.
సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి కార్తె ఏర్పడుతుందని పండితులు పేర్కొంటున్నారు.
తొలికరి జల్లుల పలకరింపు ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి.
సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు.వ్యవసాయ పనులకు రైతులు శ్రీకారం చుట్టారు.